డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనం.. ఉర్గాం – పల్లా జకోలా మధ్య అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.