ఇడ్లీలు: నాలుగు, పల్లీలు, శనగపప్పు, మినుపపప్పు, బియ్యం, ధనియాలు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, మిరియాలు: ఒక టీస్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, ఎండుమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, చాట్ మసాలా: పావు టీస్పూన్.
ఇడ్లీలను పొడవాటి ముక్కలుగా కోయాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోయాలి. బాగా వేడయ్యాక ఇడ్లీ ముక్కలను రంగు మారే వరకు వేయించాలి. స్టవ్మీద పాన్పెట్టి పల్లీలు, శనగపప్పు, ఎండు మిర్చి, బియ్యం, ధనియాలు, మిరియాలు, కరివేపాకు వేయించాలి. చల్లారిన తర్వాత అన్నిటినీ మిక్సీలో వేసి తగినంత ఉప్పు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. వేయించిన ఇడ్లీ ముక్కలను ఒక గిన్నెలో కుమ్మరించి పైనుంచి పప్పుల పొడి, చాట్ మసాలా వేసి కలిపితే ఫ్రైడ్ ఇడ్లీ సిద్ధం.