హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలిసి చేసే సినిమా గురించి సినీ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు.
వైల్డ్ లైఫ్లో సాగే అడ్వెంచర్తో కథా నేపథ్యం ఉంటుందని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా రాజమౌళి స్పందిస్తూ..‘మహేష్తో తెరకెక్కించే సినిమా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఉంటుంది. ఆశ్చర్యపరిచే అనేక సాహసాలతో హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నాం. సినిమా అంతా సాహసయాత్రలా సాగుతుంది’ అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీదే ఉండగా…మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకుంది.