ఇటీవలే రిలీజైన మేజర్, విక్రమ్ సినిమాలను ప్రేక్షకులు అందుబాటు ధరల్లో వీక్షించేలా టికెట్ ధరలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కంటెంట్ ఉంటే టికెట్స్ ధరలు పెంచకున్నా కలెక్షన్లు వసూలు అవుతాయని ఈ రెండు సినిమాలు రుజువు చేశాయి. ఈ సినిమాల బాటలోనే వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం విరాటపర్వం (Virataparvam) మేకర్స్ కూడా వెళ్తున్నట్టు తాజాగా ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
టికెట్ ధరలు పెంచకుండా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్ ల్లో రూ.200గా కొనసాగనున్నట్టు తాజా టాక్. మరోవైపు ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.147, మల్టీప్లెక్స్ ల్లో రూ.177గా ఉండనున్నట్టు తెలుస్తోంది. రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. కంటెంట్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
విరాటపర్వంలో నవీన్చంద్ర, సాయిచంద్, నివేదా పేతురాజ్, ప్రియమణి, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్టును సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
Read Also : Brahmastra | షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..!
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్లో స్టిల్