పాన్ ఇండియా (Pan India director) డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదల తర్వాత మహేశ్ బాబు మూవీ స్క్రిప్ట్ పై పనిచేయనున్నాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై ఓ ఆసక్తికర అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ను రాజమౌళి ఈ సినిమా కోసం సంప్రదించాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మహేశ్ ప్రాజెక్టులో ప్రతినాయకుడి పాత్ర చేయాలని విక్రమ్ (Vikram)తో జక్కన్న చర్చించినట్టు టాక్ నడుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్న విక్రమ్ అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించిన రాజమౌళి అతనితో సంప్రదింపులు జరిపాడట. అంతేకాదు విక్రమ్ కూడా త్వరలోనే ఈ విషయంపై మాట్లాడేందుకు రాజమౌళిని కలవబోతున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం మహేశ్, రాజమౌళి కెరీర్లో చేయనట్వంటి సరికొత్త కథాంశంతో రాబోతుందని ఇన్సైడ్ టాక్.
మహేశ్ బాబుతో చేయనున్న సినిమా ఆఫ్రికా అడవుల (African forests)నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ హింట్ కూడా ఇచ్చేశాడు. విజయేంద్రప్రసాద్-రాజమౌళి కాంబోలో మహేశ్ బాబు-విక్రమ్ తారాగణం వర్కవుట్ అయితే సినిమా ఇక విజువల్ ఫీస్ట్గా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్లో మహేశ్బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్కపూర్