VijaySethupathi | తెలుగు, తమిళ భాషలతోపాటు నార్తిండియాలో కూడా ఫాలోవర్లున్న కోలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు విజయ్ సేతుపతి. తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు సంజయ్ దత్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అవును ఇప్పుడు ఈ క్రేజీ వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ కుమార్తో విదాముయార్చి మూవీని తెరకెక్కించిన తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. మక్కళ్ సెల్వన్ లీడ్ రోల్లో నటించనున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటించబోతున్నాడట. ఈ చిత్రంలో బీటౌన్ భామ శ్రద్ధాకపూర్ను హీరోయిన్గా ఫైనల్ చేశారన్న న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆదిత్యబిర్లా గ్రూప్ నిర్మించనుందని సమాచారం.
విజయ్ సేతుపతి, సంజయ్ దత్ సెఫరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లని తెలిసిందే. మరి ఇద్దరు సిల్వర్ స్క్రీన్పై కలిసి నటిస్తే అభిమానులు, మూవీ లవర్స్కు పండగే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబోపై ఏదైనా అధికారిక వస్తుందేమో చూడాలి మరి.
Latest buzz – #VijaySethupathi in a Big-Budget Film directed by Magizh Thirumeni
Heroine: #ShraddhaKapoor
Villain: Sanjay Dutt
Produced by Aditya Birla Group pic.twitter.com/fAwwwF4Rt5— Studio Flicks (@StudioFlicks) March 3, 2026
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు