Dil Raju | టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) తో వారసుడు (Vaarasudu) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో వారిసు టైటిల్తో తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో జరిపిన చిట్చాట్ సెషన్లో దిల్ రాజు ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నారు. ముందుగా వారసుడు చిత్రానికి విజయ్ను అనుకోలేదట.
ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లను ముందుగా అనుకుంటున్నట్టు చెప్పారు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరనే కదా మీ డౌటు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి మొదట ఈ కథను మహేశ్బాబుతో చేయాలనుకున్నాడు. అయితే అప్పటికే మహేశ్ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఒకే కాలేదన్నారు. ఆ తర్వాత రాంచరణ్ అయితే బాగుంటుందని అనుకున్నాం. కానీ అనుకోకుండా రాంచరణ్తో అప్పటికే ఆర్సీ 15 డిస్కషన్స్ ఉండటంతో వారసుడు సినిమా కథ విజయ్ దగ్గరికెళ్లిందని.. అలా ఫైనల్ అయిందని చెప్పుకొచ్చారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వారసుడు ప్రాజెక్ట్లో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్హాసన్ డెడికేషన్కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Also : Venkatesh | వెంకటేశ్ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!