ఆపద వచ్చినప్పుడల్లా తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వలన చాలా మంది పరిస్థితి ధైన్యంగా మారింది.ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చారు.
విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు,వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను సాయంగా అందించారు విజయ్ . అంతేకాక విజయ్ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్.ఆనంద్ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్ మంగళవారం సేవల్లో నిమగ్నమయ్యారు. కాగా, విజయ్ చివరిగా మాస్టర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇవికూడా చదవండి..