గతేడాది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్తో పూరీ జగన్నాథ్తో విజయ్ లాంఛ్ చేసిన జేజీఎం కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని విధంగా కొత్త సినిమా అప్డేట్ అందించి అభిమానులను సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్ (VD12) ప్రకటించాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్తో కలిసి టాప్ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పేందుకు.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. అనామక గూఢచారి అంటూ కాన్సెప్ట్ పోస్టర్ను షేర్ చేశారు మేకర్స్. నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్, టీం గురించి విన్నప్పుడు.. నా గుండె కొన్నిసార్లు కొట్టుకుంది.. అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.
తాజా అప్డేట్ విజయ్ చేయబోయే సినిమా కాప్ స్టోరీతో రాబోతుందని హింట్ ఇస్తోంది. ఈ సినిమాలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ సమంతతో కలిసి నటిస్తున్న ఖుషి చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ సినిమా లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
The Script. The Team. My next.
My heart skipped a few beats when I heard this. #VD12 pic.twitter.com/x7ELlsb6Ub
— Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2023