రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ రౌడీ హీరోకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతంటా అభిమానులు ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో నార్త్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు విజయ్. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు.. తన అభిమానులకు రెగ్యులర్గా టచ్లో ఉంటూ బాగా చూసుకుంటాడన్న పేరు విజయ్కు ఉంది.
విజయ్ తన ఫ్యాన్స్ కోసం ఐదు సంవత్సరాల క్రితం ఓ నూతనవరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ, కొత్త సంవత్సరం సందర్భంగా.. దేవరసంతా (Deverasanta) అనే క్యాంపెయిన్ పేరుతో వంద మంది అభిమానులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తూ వస్తున్నాడు. ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన క్యాంపెయిన్ను ప్రతి సంవత్సరం విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే ఈ ఏడాది క్యాంపెయిన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది 100 మంది అభిమానులను హాలిడే ట్రిప్ కి పంపిస్తున్నట్లు విజయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
ఈసారి 100 మంది అభిమానులను మనాలీ టూర్ కోసం విజయ్ పంపించగా.. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ ట్రిప్ ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు ఉండగా.. వారం రోజుల కిందటే వారి పేర్లను అనౌన్స్ చేశాడు. ఈ నెల 17న టూర్ ప్రారంభంకాగా టూర్కు వేళ్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోను విజయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.
”100 మంది లక్కీ ఫ్యాన్స్ విమానంలో ఉన్న వీడియో ఇది. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఈరోజు ఉదయం వాళ్లు ఫ్లైట్ లో ఉన్న వీడియోను నాకు పంపించారు. హాలీడే ఎంజాయ్ చేయడానికి పర్వతాల్లోకి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది” అని విజయ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
Cutest ❤️ they sent me a video from their flight this morning.
And they are off on their holiday to the mountains!
100 from across the country, makes me so happy 🥰#Deverasanta2022 pic.twitter.com/BF4DX5PIyG
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2023