కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారైంది. థియేటర్లు తెరిచినా కూడా ప్రేక్షకులు ముందులా వస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇలాంటి సమయంలో సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మంచి రేటు వస్తే నేరుగా డిజిటల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ నటించిన నారప్ప సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.
నారప్ప సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 24న అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో నేరుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్లు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. అక్కడ ధనుష్ పోషించిన పాత్రను ఇక్కడ వెంకీ చేశాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా ప్రియమణి నటించింది. నారప్ప సినిమానే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ నటిస్తున్న దృశ్యం 2 కూడా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రానా, సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెళ్లి పీటలెక్కిన జబర్ధస్త్ కంటెస్టెంట్స్
కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఘనంగా శంకర్ కూతురి వివాహం.. హాజరైన సీఎం
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్