టీఆర్పీల కోసం కొన్ని టీవీ ఛానెల్స్ చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య సుధీర్- రష్మీవివాహం చేసుకున్నారంటూ ప్రోమోతో ఆసక్తిని రేకెత్తించగా ఇప్పుడు జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్ లైట్లోకి వచ్చిన వర్మ-ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసి జనాలని పిచ్చోళ్లని చేశారు. టీఆర్పీల కోసం ఇలాంటి ఫేక్ పెళ్లిళ్లు అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.
వివరాలలోకి వెళితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వర్ష ఈ మధ్య జులై 4న కీలక ప్రకటన చేస్తానని చెప్పి.. చేతికి ఉంగరం ఉన్న ఫొటోను , తాళిని తన ఇన్స్టగ్రామ్లోఆమె పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసి ఆమె తన పెళ్లి ప్రకటన చేస్తుందేమో అని అందరు అనుకున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వర్ష- ఇమ్మాన్యుయేల్ వివాహం జరిపించగా, జూలై 4న వీరి పెళ్లి వేడుక ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను రీసెంట్గా విడుదల చేసింది. ఈ ప్రోమో వైరల్గా మారింది.