దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ రోజు తమిళనాడులోని మహాబలిపురంలో తన కూతురు ఐశ్వర్యని క్రికెటర్ రోహిత్ దామోదరన్కి ఇచ్చి వివాహం జరిపించారు. వీరి పెళ్లికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గత కొద్ది రోజులుగా శంకర్ కూతురు పెళ్లి వార్తలలోకి ఎక్కగా, ఎట్టకేలకు ఈ రోజు ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించారు.
రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. కాగా, శంకర్కు ముగ్గురు సంతానం కాగా, కుమారుడు అర్జిత్ చదువుకుంటున్నాడు. కూతుళ్ళు ఐశ్వర్య, అదితిలలో పెద్ద కూతురు ఐశ్వర్య. ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమాతో పాటు రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ మూవీలతో బిజీగా ఉన్నాడు.