ఈ ఏడాది పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన వకీల్సాబ్ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది కోలీవుడ్ భామ నివేదా థామస్. ఈ చిత్రంలో నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ ఖాతాలో మరో క్రేజీ మూవీ పడిపోయినట్టు టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నివేదా ముఖ్య పాత్రలో కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.
ప్రొడక్షన్ టీం ఇప్పటికే నివేదా థామస్ తో సంప్రదింపులు కూడా జరిపిందని, తన నిర్ణయం వెల్లడించమే తరువాయి అని ఫిలింనగర్ సర్కిల్ లో వార్తలు ఊపందుకున్నాయి. మహేశ్-త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పలువురు ప్రముఖ యాక్టర్లు భాగస్వామ్యం కానున్నారు. పూజాహెగ్డే, జాన్వీకపూర్, కైరా అద్వానీ పేర్లు హీరోయిన్ల జాబితాలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్