ముంబై : యానిమల్ మూవీతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న తృప్తి డిమ్రీ (Triptii Dimri) లేటెస్ట్ ఇన్స్టాగ్రాం పోస్ట్లో పర్పుల్ శారీలో పరువాల విందుతో రెచ్చిపోయింది. యానిమల్లో జోయా క్యారెక్టర్లో తృప్తి డిమ్రీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలోని క్యారెక్టర్లు ఆమెను బాభి 2గా పిలుస్తుంటారు.
ఆమె లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్ కామెంట్స్లోనూ ఫ్యాన్స్ బాభీ 2 అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్లో యానిమల్ సెన్సేషన్ తృప్తి పర్పుల్ శారీలో, బ్లాక్ బ్లౌజ్లో మతి పోగొట్టింది. నేషనల్ క్రష్ అంటూ తృప్తిని ఫ్యాన్స్ కామెంట్స్ సెక్షన్లో ఆకాశానికి ఎత్తేశారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్లో తృప్తి డిమ్రీతో పాటు రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కనిపించారు. తండ్రీ కొడుకుల బంధంపై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Read More :