రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ నటుడు ప్రస్తుతం ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో విడుదల కాలేదు. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేస్తున్నారని వార్తలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో హీరో మాట్లాడుతూ..తమ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల కాబోతుందని తెలిపాడు. ఇప్పటికే టీజర్ తో పాటు విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. కల్యాణ మండపం స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీధర్ గడే డైరెక్ట్ చేస్తున్నాడు. టాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాతపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com