Samantha | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala temple) ప్రముఖ నటి సమంత (Samantha) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న నటికి తితిదే (Tirumala Tirupati Devasthanam) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం బయట సమంతను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అమ్మవారి దర్శనం అనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
#Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024
Also Read..
Tapas Roy | పార్లమెంట్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్కు గట్టి షాక్.. సీనియర్ నేత రాజీనామా
Himachal Pradesh | హిమాచల్లో భారీ హిమపాతం.. జాతీయ రహదారులు సహా 650 రోడ్లు మూసివేత