సాధారణంగా కొన్ని కథలు (cinema stories) ఒకరి చేతుల్లో నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తూ..ఫైనల్గా ఎవరో ఒకరి చేతుల్లో ల్యాండింగ్ అవుతుంటాయి. దర్శకుడు, రైటర్ ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారు..అది కాస్తా యూ టర్న్ తీసుకుని మరో హీరో దగ్గరికి వెళ్తుంది. ఇలా వెళ్లిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచినవి కొన్నైతే..బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినవి మరికొన్ని. ఈ మధ్య ఫెయిల్యూర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు రాధేశ్యామ్, ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ రెండు సినిమాలు ముందుగా ఓ టాలీవుడ్ హీరో చేయాల్సిందట.
అయితే ఆ హీరో అదృష్ణవశాత్తు ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో డిజాస్టర్ల బారిన పడకుండా సేఫ్ జోన్లో ఉన్నాడట. ఇంతకీ మరి ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? విక్టరీ వెంకటేశ్ (Venkatesh)..అవును మీరు విన్నది నిజమే. డైరెక్టర్ కిశోర్ తిరుమల (Kishore Tirumala) ముందుగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను వెంకటేశ్తో చేయాలని ఫిక్సై..ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేశాడట. కానీ అనుకోని కారణాల వల్ల వెంకీ తప్పుకోవడంతో శర్వానంద్ను లైన్ లోకి తీసుకున్నట్టు టాక్.
మరోవైపు రాధేశ్యామ్ (Radhe Shyam) ఒరిజినల్ ఐడియాతో డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ముందుగా వెంకీతో సినిమా చేయాలనుకోగా…పలు కారణాలతో ఆ స్క్రిప్ట్ కాస్తా రాధాకృష్ణకుమార్ వైపు వెళ్లడం, దాన్ని డెవలప్ చేసి ప్రభాస్ తో సినిమా చేయడం జరిగిందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి వెంకటేశ్ ఈ రెండు సినిమాలకు నో చెప్పి అదృష్టవంతుడిగా మారిపోయాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.