Made in India | భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించబోతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ చిత్రానికి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారు. ‘భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నాం. మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది? ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమిటనే అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నాం.
కథ, కథనాలతో పాటు ఈ సినిమా విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు తెలిపారు. మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై వరుణ్గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.