Rajamouli | మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. నిన్న ఆస్కార్ నామినేషన్స్.. నేడు పద్మశ్రీ అవార్డు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ముందుకు రావడం పట్ల దర్శకధీరుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సంతోషాన్ని జక్కన్న ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
నిజానికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడో రావాల్సింది… కానీ చాలా ఆలస్యమైందని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ విశ్వం ఊహించని రీతిలో అందిస్తుందని మీరు చెప్పిన మాటలను ఇప్పుడు నమ్ముతున్నానంటూ చెప్పుకొచ్చాడు. తనకే కనుక విశ్వంతో మాట్లాడే శక్తి ఉంటే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వు అని దానికి చెబుతానంటూ పేర్కొన్నాడు. పెద్దన్న కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందంటూ రాసుకొచ్చాడు.
MY PEDDANNA.
MM KEERAVAANI.
RECIPIENT OF PADMA SHRI AWARD.
PROUD!!!— rajamouli ss (@ssrajamouli) January 26, 2023
“Waltair Veerayya | మెగాస్టారా మజాకా.. రూ.200 కోట్ల క్లబ్లో వాల్తేరు వీరయ్య..!”