టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు పరశురాం (Parasuram ). ఆంజనేయులు, సోలో, గీతగోవిందం లాంటి సినిమాలతో డైరెక్టర్గా తన మార్కు చూపించాడు. ఈ ఏడాది మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసి మంచి హిట్టు అందుకున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. పరశురాం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవతున్నారన్న వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓ సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో కథ సిద్దం చేసుకున్న పరశురాం త్వరలోనే పవన్ను కలిసి ఆ కథను వినిపించడానికి రెడీ అవుతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
పవన్ ఇప్పటికే క్రిష్ సినిమాతోపాటు వినోధయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ సినిమాలు లైన్లో పెట్టాడు. మరి ఇలాంటి పరిస్తితుల్లో పరశురాంతో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..లేడా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు. పవన్ కల్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ టీంతో కలిసి వర్క్ షాప్ లో పాల్గొన్న స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేశాయి.
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Pooja Hegde | పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించిన సల్మాన్ ఖాన్, వెంకటేశ్.. ట్రెండింగ్లో వీడియో
Read also : Mohan Raja | లూసిఫర్ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read also : Chiranjeevi | రీమేక్ ఒక సవాల్..గాడ్ ఫాదర్ విజయం ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ