టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) మళ్లీ మునుపటిలా మెల్లమెల్లగా సాధారణ జీవితంలోకి వచ్చేస్తుంది. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేందుకు ఆత్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే చార్ధామ్ యాత్ర నుంచి తిరిగొచ్చిన సామ్ తనలోని పెయింటింగ్ ఆర్ట్ (painting art) ను మళ్లీ బయటకు తీసింది. చేతిలో బ్రష్ పట్టుకుని హోప్ కొస్మొస్ పేరుతో అందమైన చిత్రలేఖనం చేసింది. తన పెయింటింగ్ను అందరికీ చూపిస్తూ ఓ ఫొటోను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఈ స్టిల్ తోపాటు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఆ రోజుల్లో ఒకటి💕 ‘నువ్వు చిత్రించలేవు’ అని మీలో ఒక స్వరం విన్నట్లయితే, అన్ని రకాలుగా పెయింటింగ్ వేయండి ఆ మాట నిశ్శబ్దమవుతుంది. కోవిడ్ 19 బారిన పడిన ప్రజలకు ఘనంగా నివాళులర్పిస్తూ రూపొందించిన ఆర్ట్ ప్రాజెక్ట్ హోప్ కోస్మోస్. హైదరాబాద్ ఆర్టిస్ట్ మనోహర్ చిలువేరు (manohar chiluveru) ప్రాజెక్ట్ కమ్యూనిటీ కార్యక్రమంతో మమేకమై ప్రజలను ఒకచోట చేర్చి, వారిలో ఆశను ప్రోత్సహించేందుకు కళను ఒక మాధ్యమంగా ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారని సామ్ పోస్ట్లో పేర్కొంది.
సమంత ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలోకాతువాకుల రెండు కాధల్ సినిమాలో నటిస్తోంది. విజయ్సేతుపతి, నయనతార ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్బీర్కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్లో పూజాహెగ్డే