మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆచార్య షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. లూసిఫర్ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ కూడా ఇదే ఏడాది పట్టాలెక్కనుంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు మెగాస్టార్.
పవర్, జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమాలతో స్టార్ హీరోలను బ్యాలెన్స్ చేయడంలో ఆరితేరిపోయాడు. ఈయన చెప్పిన ఒక కథ చిరంజీవికి చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్ ఎమోషన్ ఎక్కువగా ఉన్న ఒక కథను మెగాస్టార్ కు చెప్పి ఒప్పించాడు బాబీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. దీని కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎవరూ ఊహించని టైటిల్ బాబీ ఆలోచిస్తున్నాడు.
తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. వీరయ్య అనే పక్క ఓల్డ్ మాస్ టైటిల్ చిరంజీవి సినిమాకు కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ లాంటి హీరోకి ఇలాంటి టైటిల్ ఏంటి అని చాలామంది అనుమానంగా ఉన్నా కూడా కథ ప్రకారం ఇది పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. బాబీ చెప్పిన విధానం నచ్చి చిరంజీవి కూడా ఇదే టైటిల్ కు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. అన్నీ కుదిరితే నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
ఆ స్టార్ హీరోయిన్ను లొకేషన్లో చెల్లి అని పిలిచిన విక్రమ్
క్రికెటర్తో కూతురు పెళ్లి చేయబోతున్న డైరెక్టర్ శంకర్
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!