‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ ఉత్కంఠకు తెరపడింది. హోరాహోరీగా నువ్వా, నేనా అన్నట్టుగా ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య జరిగిన పోటీలో ‘మా’ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కబోతుందని ఎదురుచూస్తున్న వారి కోసం క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. ఎన్నో అవార్డులు తెచ్చుకుని, రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ (Prakash Raj)ఒకవైపు..నటుడిగా, నిర్మాతగా ‘మా’కు తన సేవలందిస్తానని ముందుకొచ్చిన యువ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) మరోవైపు..మొత్తానికి సీనియారిటీ, అనుభవాన్ని పక్కన పెట్టి మా సభ్యులంతా మంచు విష్ణుకు అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టారు. ‘మా’ రూపురేఖలు మారుస్తానని మొదటి నుంచి ఎంతో ధీమాగా చెప్తున్న ప్రకాశ్ రాజ్ కు చుక్కెదురైంది.
ప్రకాశ్రాజ్పై మంచు విష్ణు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మంచు విష్ణుకు 400కు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. విష్ణు ప్యానెల్ నుంచి ట్రైజరర్గా శివబాలాజీ, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, వైస్ ప్రెసిడెంట్గా మాదాల రవి గెలుపొందారు. విష్ణు ప్యానెల్లో ఏడుగురు ఈసీ సభ్యులు గెలిచారు. ఈసీ సభ్యుల్లో ప్రకాశ్రాజ్ ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రకాశ్రాజ్ ప్యానెల్లో 11 మంది ఈసీ సభ్యులు గెలుపొందారు.
ఈసీ సభ్యులు వీళ్లే..
మంచు విష్ణు ప్యానెల్లో మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత, సంపూర్ణేశ్ బాబు ఈసీ సభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ సభ్యులు శివారెడ్డితోపాటు కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం, ప్రగతి గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ