రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న విడుదలకానుంది. గురువారం టైగర్ దండయాత్ర పేరుతో టీజర్ను విడుదల చేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేసిన స్టూవర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నారనే వార్తతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సంభాషణలు ఆకట్టుకున్నాయి. రవితేజ పాత్ర పవర్ఫుల్గా అనిపించింది. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ.