భూత్పూర్, ఏప్రిల్ 26: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కరోనా సమయంలో ధాన్యాన్ని మార్కెట్కు తీసుకుపోయి ఇబ్బందులు పడొద్దనే గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్బస్వరాజ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్నారాయణగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, నాయకులు మనెమోని సత్యనారాయణ, చంద్రశేఖర్గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, అశోక్గౌడ్, రమేశ్చందర్, తిరుతపయ్యగౌడ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఏప్రిల్ 26: మండలంలోని వెలుగొమ్ముల, కొత్తూర్, బోయిన్పల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ కాంతమ్మ, జెడ్పీటీపీ శశిరేఖ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు నారాయణరెడ్డి, రాధికరెడ్డి, ఏఈవో సాయికృష్ణ, నాయకులు ప్రతాప్రెడ్డి, బాలస్వామి, జనార్దన్రెడ్డి, నరసింహ ఉన్నారు.