టాలీవుడ్ (Tollywood) యువ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ది వారియర్ (The Warriorr) జులై 14న పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. గ్రాండ్గా థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ను నైజాం ఏరియాలోని థియేటర్లలో వీక్షించాలంటే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందేనని తాజా అప్ డేట్ చెబుతోంది.
తాజా సమాచారం ప్రకారం ది వారియర్ టికెట్స్ ధరల వివరాలిలా ఉన్నాయి. నైజాం ఏరియాలో మల్లీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.295గా నిర్ణయించగా..సింగిల్ స్క్రీన్స్ లో రూ.175గా ఉంది. ఇక ఆంధప్రదేశ్లో సింగిల్ స్క్రీన్స్ లలో రూ.147గా ఉండగా..మల్టీప్లెక్స్ థియేటర్లలో దీన్ని రూ.177గా నిర్ణయించారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. నదియా కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ది వారియర్లో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.