ఎస్తర్, శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్య ప్రధానపాత్రధారులుగా, చంటి గానమని దర్శకత్వంలో వెంకటేశ్ చిక్కాల నిర్మిస్తున్న ‘లేతాకులు’ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి వకుళాభరణం కృష్ణమోహన్రావు క్లాప్ ఇవ్వగా, మోహన్ వడ్లపట్ల కెమెరా స్విచాన్ చేశారు. తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందించగా, వి.వి.సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
ఇండియన్ హిస్టరీలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని, ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చే కథ ఇదని, ఎస్తర్ పాత్ర సినిమాకు హైలైట్గా నిలుస్తుందని, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత చెప్పారు. మనల్ని ఎవరైనా బాధపడితే, మనం పడిన బాధ వాళ్లకు కూడా కలిగేలా చేయడం అసలైన శిక్ష. ఈ నేపథ్యంలో కథ ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: మురళీమోహన్రెడ్డి, సంగీతం: సుక్కు.