తెలుగు సినీ నిర్మాత, రచయిత ప్రమోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏండ్లు. గత కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 300 చిత్రాలకు పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆయన..‘సుబ్బయ్య గారి మేడ’, ‘తెర వెనుక తెలుగు సినిమా’ వంటి రచనలు చేశారు.
మోహన్ బాబు హీరోగా ‘దొంగ పోలీస్’, ‘గరం మసాలా’ చిత్రాలను నిర్మించారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రమోద్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.