BVS Ravi| టాలీవుడ్లో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే కొద్దిమంది సెలబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటారు పాపులర్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి. ఓ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేముందు తెలుగు ఇండస్ట్రీలో సరైన ప్రణాళిక కొరవడిందని హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు ఆదిత్య ధర్-రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కిన ధురంధర్ ప్రాంచైజీని ఉదాహరణగా తీసుకున్నాడు. రూ.260 కోట్లతో తెరకెక్కిన ఈ ప్రాంచైజీని తెలుగులో ఇదే బడ్జెట్తో తీయలేమన్నారు .
ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ఆదిత్య ధర్ 8 గంటల పుటేజీని షూట్ చేశాడు. దీని కోసం ఎంత కష్టపడి పనిచేశాడో.. ఏ స్థాయిలో పరిశోధనలు చేశాడో ఊహించుకోవచ్చు. తన నిర్మాతలను అంత డబ్బు పెట్టేలా ఎలా ఒప్పించగలిగాడో.. ధురంధర్ ప్రాంచైజీతో రెగ్యులర్ నిర్మాతలకు చరమగీతం పాడే సమయం షురూ అయింది. నిర్మాతలు ధురంధర్ ప్రాంచైజీని రూ.260 కోట్లలోపు బడ్జెట్తో తెరకెక్కించారు. అది కూడా భారీ తారాగణం, ప్రపంచ స్థాయి ఫైట్స్, రణ్ వీర్ సింగ్ విలాసవంతమైన ఇల్లుతోపాటు ఇతర అద్భుతమైన లొకేషన్లలో తీశారు.
ఒకవేళ తెలుగులో ఈ సినిమా తీస్తే రూ.500 కోట్ల బడ్జెట్ అవుతుంది. తప్పు కేవలం హీరోలదే అనలేం. వాళ్లు సెట్స్కు వస్తే ఓ గంట ఆలస్యంగా వస్తారు. కానీ ప్లానింగ్లో లోపం, ప్రొడక్షన్స్ టైమ్ లైన్స్ పొడిగింపబడతాయి. ఇక్కడ ప్రతీది ప్రణాళికపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Yash | కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో నటించేందుకు కారణమిదేనట..!
Sukesh Chandrashekhar | మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్కు బెయిల్.. అయినా జైలులోనే
Kanaka Durga | భక్తి, యాక్షన్ కలబోతగా అల్లరి నరేష్ ‘కనకదుర్గ’.. గ్రాండ్గా లాంచ్ అయిన మూవీ!