Zombie Reddy 2 | జాంబి జోనర్ టాలీవుడ్లో అంతగా ఎలివేట్ కాలేదని తెలిసిందే. అయితే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మాత్రం ఈ జోనర్లో వచ్చే సినిమాలు మంచి వినోదంతోపాటు థ్రిల్ అందిస్తాయని జాంబిరెడ్డి సినిమాతో నిరూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు జాంబిరెడ్డి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. వారి కోసమే అదిరిపోయే వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
మిరాయి తర్వాత తేజ సజ్జాతో మరో సినిమా చేయబోతున్నట్టు పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిందని తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ఈ బ్యానర్ జాంబిరెడ్డి 2ను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అయిందట. అయితే ఈ సారి మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం లేదని.. ప్రశాంత్ వర్మ కథనందిస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
సీక్వెల్లో సన్నివేశాలు మరింత క్రూరంగా, ప్రాణాంతకంగా ఉండేలా కథ రెడీ చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. మరో దర్శకుడు ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేయబోతున్నాడంటూ వార్తలు ఊపందుకోగా.. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనేది ఆసక్తికరంగా మారింది.
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
| చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!