simbu hospitalized | తమిళ స్టార్ హీరో శింబు హాస్పిటల్లో చేరాడు. ఈయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందో తెలియక కంగారు పడుతున్నారు. అసలే మళ్లీ కరోనా విజృంభిస్తున్న సమయంలో శింబు హాస్పిటల్లో చేరడం అందరిని కంగారు పడుతోంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు అని.. అతడికి ఏమీ కాలేదు అంటూ పీఆర్ వర్గాలు వెల్లడించాయి. గొంతు నొప్పి కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని.. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అంటూ స్పష్టం చేశారు.
శింబు హాస్పిటల్ లో చేరాడు అనే విషయం తెలియగానే అందరూ అతడికి కరోనా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కరోనా కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దాదాపు రెండు వారాలు ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. దాంతో శింబు విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ అందరూ చెప్పారు. అయితే అలాంటిదేమీ లేదని.. అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు అంటూ అతడి సన్నిహితులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని.. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు శ్రేయోభిలాషులు.
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలోనే ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడు. గొంతు నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ చేరుకున్నాడు శింబు. ఈ మధ్యే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈయన నటించిన మానాడు సినిమా మంచి విజయం అందుకుంది. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత మాస్ సాంగ్ ఆ సినిమా పాటకు కాపీనా?
Pushpa | అల్లు అర్జున్ పుష్ప సినిమాకు 250 కోట్ల బిజినెస్!
ఆలియా భట్తో నటించడానికి తారక్ కంగారుపడ్డాడా?
అలరిస్తున్న అఖండ కాస్టూమ్స్.. డిజైనర్ రామ్పై ప్రశంసల జల్లు