ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, డా॥ కీర్తిలత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయిప్రసన్న ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. రమేష్ చెప్పాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్ను గురువారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాం. చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల వారిని మెప్పించే అంశాలుంటాయి’ అన్నారు.
నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్గారు టీజర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. చక్కటి సందేశాన్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా :కె. చిట్టిబాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం: సుద్దాల అశోక్తేజ, నిర్మాతలు: డాక్టర్ ॥ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి, రచన-దర్శకత్వం: రమేష్ చెప్పాల.