త్వరలో సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata) సినిమాతో అభిమానులు, మూవీ లవర్స్ ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన కళావతి పాట నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేస్తూ..ముందుకెళ్తుండగా..తాజాగా మరో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
మార్చి 17న రెండోపాటను విడుదల చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. పైసావసూల్ అప్ డేట్ కోసం సిద్దంగా ఉండండి..సర్కారు వారి పాట రెండో సాంగ్ ప్రకటన రేపే అంటూ ట్వీట్ చేసింది. మరి రెండో పాట ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Get ready for the Paisa Vasool update 💥💥💥#SarkaruVaariPaata Second Single announcement tomorrow 🤘#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/VAbzQox2GD
— Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2022
కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ప్రాజెక్టును మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.