తమిళ నటుడు సూర్య సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టకాలంలో తన వంతు సాయం అందిస్తూ ఉండే సూర్య సెకండ్ వేవ్ అధికంగా ఉండడం వలన తమిళనాడు ప్రభుత్వనిథికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇక తాజాగా తన ఫ్యాన్ క్లబ్కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బుని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
కరోనా వలన సూర్య అభిమానులు చాలా కష్టాలు పడుతున్నారు. వారి పరిస్థితులని చూసి చలించిన సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. సూర్య తన అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ హిట్ కొట్టిన సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడీవాసల్’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోను సినిమాలు చేయనున్నారు.