సికింద్రాబాద్, నవంబర్ 21: డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తుల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ను కలిసి ఆయనకు ఎన్నికల్లో బేషరతుగా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణా నాయి బ్రాహ్మణా సంఘం ప్రతినిధుల సమావేశం మంగళవారం శ్రీనివాస్నగర్ కాలనీలోని సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధ్యక్షుడు జె.రాంబాబు నాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ నాయి, కోశాధికారి శంకర్ నాయి, గౌరవాధ్యక్షుడు మనోహర్ నాయి, నేతలు హరినాద్, కె.వెం కటేష్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన తీగుళ్ల పద్మారావు గౌడ్ను సంఘం నేతలు ఘనంగా సతరించారు. పదేళ్లుగా సికింద్రాబాద్లో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి పద్మారావు గౌడ్ కృషి చేశారని పేరొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పూర్తి మద్దతునిస్తామని రాంబాబు నాయి తదితరులు ప్రకటించారు.
ఈ మేరకు ఓ తీర్మానాన్ని పద్మారావు గౌడ్కు అందించారు. తెలంగాణా విశ్వ బ్రాహ్మణ సంఘం, పార్సిగుట్ట విభాగం అధ్యక్షుడు ఎల్లగారి శ్రీహరిచారి నేతృత్వంలో ప్రతినిధులు రాఘవాచారి, పెంటాద్రి, భాసర్, రమణాచారి తదితరుల బృందం మంగళవారం పద్మారావు గౌడ్ను కలిసి తమ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు తమ సంఘం సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పద్మారావు గౌడ్కు శ్రీహరిచారి తదితరులు అందజేశారు. తీగుల్ల పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ నియోజకవర్గ గౌడ్ సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తమ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సంఘం అధ్యకుడు శ్రీనివాస్ పద్మారావు గౌడ్ను కలిసి అందించారు. సంఘం నేతలు ఆంజనేయులు, రాజేశ్వర్ గౌడ్, లింగం గౌడ్, నర్సయ్య గౌడ్, సురేష్ గౌడ్, కుమార స్వామి, మానస, రేణుక, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పలు కుల సంఘాల వారికి పద్మారావు గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.