టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గాక సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతుండగా, ఇవి సినిమాపై భార అంచనాలు పెంచుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్లో కన్నడ స్టార్ హీరో సుదీప్ కీ రోల్ పోషిస్తున్నట్టు వినికిడి. రామ్ చరణ్, సుదీప్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని కలిగిస్తాయని అంటున్నారు. గతంలోను సుదీప్ పలు తెలుగు సినిమాలలోను కీ పాత్రలు పోషించారు. ఆయన పాత్రలకు మంచి ఆదరణ కూడా దక్కింది.