SS Rajamouli | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇన్ని రోజులూ బిజీబిజీగా గడిపిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన విలువైన సమయాన్ని కుటుంబంతో జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లారు. తమిళనాడు (Tamil Nadu)లోని తూత్తుకుడిలోని ఓ రిసార్ట్స్ లో భార్య, కొడుకు ఇతర కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29)కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఉండబోతుందని సమాచారం. 2025 సెకండాఫ్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.
Also Read..
Viral video | స్కూటీపై ఏడుగురు చిన్నారులతో రైడ్.. వ్యక్తి అరెస్ట్
Goodenough | లిథియం అయాన్ బ్యాటరీస్ ఆద్యుడు గుడ్ ఎనఫ్ కన్నుమూత
World Cup | వరల్డ్ కప్ ట్రోఫీని నింగిలోకి పంపిన ఐసీసీ.. వీడియో