Allu Arjun | ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి నాటు నాటు సాంగ్ అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి , మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అండ్ టీంపై ఇప్పటికే ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నో ఏండ్ల తెలుగు ఇండస్ట్రీ కల నెరవేరిన వేళ.. అరుదైన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తన సందేశాన్ని అందరితో పంచుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun) .
‘ఇండియాకు గొప్ప క్షణం. ఆస్కార్స్లో తెలుగు పాట సత్తా చాటడం సంతోషంగా ఉంది. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, సోదరులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నేనెంతో ఇష్టపడే గ్లోబల్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. తారక్, రాంచరణ్ మీ స్టెప్పులతో ప్రపంచమే డ్యాన్స్ చేసేలా చేసి.. తెలుగు నేల గర్వపడేలా చేశారు. ఈ మ్యాజిక్ జరగడానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి. భారతీయ సినిమాను అందరి హృదయానికి హత్తుకునేలా చేసింది ఆర్ఆర్ఆర్..’అని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప.. ది రూల్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ టీం త్వరలోనే హైదరాబాద్కు రానుంది. నాటు నాటు పాట విజయం వెనుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.
, our telugu pride @tarak9999 for for making the world dance to your steps & the man behind it all @ssrajamouli garu for making this magic happen . Heart touching moment for Indian Cinema #RRR
— Allu Arjun (@alluarjun) March 14, 2023