సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేదు. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఏపీలో మూడు షోలు, కరోనా ప్రతికూల పరిస్థితుల కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీసు దగ్గర వసూళ్లు ఆశాజనకంగా రాలేదు. ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. మధ్యలో కృష్ణాష్టమి ఇలాంటి సెలవు వచ్చినా కూడా ఈ సినిమా పెద్దగా ఉపయోగించుకోలేక పోయింది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు కరుణ కుమార్ చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా చాలా కారణాలతో తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం: 1.64 కోట్లు
సీడెడ్: 0.86 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.75 కోట్లు
ఈస్ట్: 0.46 కోట్లు
వెస్ట్: 0.26 కోట్లు
గుంటూరు: 0.49 కోట్లు
కృష్ణా: 0.28 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.91 కోట్లు (8.35 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.43 కోట్లు
వరల్డ్ వైడ్: 5.34 కోట్లు (9.25 కోట్ల గ్రాస్)
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 8 కోట్లకు పైగానే షేర్ వసూలు చేయాలి. కానీ రూ.5.34 కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం 63 శాతం రికవరీ రేటుతో సినిమా ఫ్లాప్ లిస్ట్లోకి వెళ్లిపోయింది. సమ్మోహనం తర్వాత సరైన విజయం లేకుండా ఉన్న సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ తో మరోసారి నిరాశ పరిచాడు. ప్రస్తుతం ఈయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పాలి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..