వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ని నిర్వహించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నేటి యువతలో చాలామంది చిన్నచిన్న సమస్యలకే సూసైడ్ దాకా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిలో మార్పు తెచ్చే కథ ఇదని, మీ లోపమే మీ బలం అవ్వాలనే ఈ కథ చెబుతుందని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.