‘కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన వినోదాత్మకమైన సినిమా ‘సామజవరగమన’. ఈ చిత్ర కథ వినగానే నువ్వు నాకు నచ్చావ్, గీతగోవిందంలా బ్లాక్బస్టర్ సక్సెస్ అవుతుందని నమ్మాను. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’ అన్నారు నిర్మాత రాజేష్ దండా. ఆయన నిర్మించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రూ.50కోట్ల గ్రాస్ని వసూలు చేసి కథానాయకుడు శ్రీవిష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ‘మా చిత్రం రూ.50 కోట్ల మార్క్ని అందుకోవడం ఆశ్చర్యపరిచింది. మంచి కంటెంట్తో వస్తే చిన్న సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని మరోసారి రుజువు చేసిన చిత్రమిది. సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాత కూడా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.
చిన్న సినిమా థియేటర్లో ముప్పై రోజులు ఆడటం చాలా పెద్ద విజయం. అలాగే యుఎస్లో ఈ సినిమా వన్ మిలియన్ సాధించింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇది పెద్ద విజయం. చాలా ఆనందంగా వుంది. ప్రస్తుతం సందీప్కిషన్తో ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం చేస్తున్నాను. చిత్రీకరణ పూర్తయింది. హారర్ ఫాంటసీ జోనర్ ఇది. మంచి యూనిక్ కంటెంట్ వుంది. నరేష్తో ఓ సినిమా, సందీప్ కిషన్తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను’ అన్నారు.