శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. జానకిరామ్ మారెళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్ రాజు క్లాప్నివ్వగా, అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు.ఫన్, అడ్వెంచర్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ చిత్రం ద్వారా దర్శకుడు బాబీ నిర్మాణరంగంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉందని హీరో శ్రీవిష్ణు పేర్కొన్నారు.
కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తన అభిరుచులను ప్రతిబింబించే సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇచ్చానని దర్శకుడు బాబీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: కోన వెంకట్, బాబీ కొల్లి, నిర్మాతలు: అనూష ద్రోణవల్లి, సీతాకుమారి, గోపాలం లక్ష్మీ దీపక్, దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల.