మహబూబ్నగర్ : కొవిడ్ నుంచి కోలుకున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావును మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి, కొవిడ్ చికిత్స వివరాలు ఆరా తీశారు. కొవిడ్ బారి నుండి త్వరగా కోలుకొని డిశ్చార్జ్ కావటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నెల 13న కొవిడ్ పాజిటివ్ రావడంతో కలెక్టర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా కలెక్టర్ డిశ్చార్జ్ విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ను పరామర్శించి ఆరోగ్య విషయాన్ని, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.