సినీ పరిశ్రమలో కొంత మంది సెలబ్రిటీల మధ్య అన్యోన్యమైన అనుబంధం ఉంటుంది. అలాంటి వారి జాబితాలో ఉంటారు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry), డైరెక్టర్ క్రిష్ (Krish). సినీ పరిశ్రమకు ప్రధాన పిల్లర్స్ లో సిరివెన్నెల ఒకరని క్రిష్ తరచూ చెప్తూనే ఉంటాడు. క్రిష్ దర్శకుడిగా గమ్యం సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు సిరివెన్నెల మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఈ గురు శిష్యులు టీచర్స్ డే (Teachers’ Day). ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నారు.
సిరివెన్నెల ఓ సందర్భంలో తన తీరు పట్ల అప్ సెట్ అయినట్టు చెప్పాడు క్రిష్. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా కోసం గురువు గారు (సిరివెన్నెల) 14 నిమిషాల పాటను రాశారు. ఈ పాటను నేనిపుడు అంగీకరిస్తాను. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదు. అప్పట్లో అది నాకు మూడో సినిమా. ఆయన రాసిన మొత్తం పాటను పూర్తిగా వాడేందుకు సిద్దంగా లేను. నేను సినిమా ఎడిటింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని. అందుకే పాటలోని కొన్ని పదాలను సినిమాలో ఉపయోగించలేదు. సిరివెన్నెల చెప్పింది వినలేదు. దీంతో ఆయన అప్ సెట్ అయి కొన్ని రోజులపాటు నాతో మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు క్రిష్.
ఇక క్రిష్ దర్శకత్వం వహించే ప్రతీ సినిమా తనకిష్టమని సిరివెన్నెల అన్నారు. గమ్యం సినిమా ట్రెండ్ సెట్టర్ అయితే కంచె చిత్రం మాస్టర్ పీస్ అని అన్నారు సిరివెన్నెల. క్రిష్ ప్రస్తుతం కొండపొలం సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్