టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas)లో స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ప్రీమియర్కు నాగార్జున, అమల, అఖిల్ హాజరయ్యారు. ఈ ముగ్గురితోపాటు ఓ పిల్లాడిని ఎత్తుకొని కెమెరాకు ఫోజులిచ్చాడు శర్వానంద్. ఇపుడీ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బైలింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం తమిళంలో కణం టైటిల్తో విడుదలవుతుంది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూరుస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ నటిస్తోంది.
వెన్నెల కిషోర్, ప్రియదర్శి , అక్కినేని అమల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్నాడు. తల్లి-కొడుకుల సెంటిమెంట్తో సినిమా తెరకెక్కుతున్నట్టు టాక్. శర్వానంద్కు ఇది 30వ చిత్రం.
Read Also : Naga Shaurya | పార్టీ మూడ్లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!