ముంబై : (Aryan Khan) నిషేధిత మత్తు మందు తీసుకున్నానని షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఒప్పుకున్నాడు. అర్బాజ్తో కలిసి చరస్ తింటున్నట్లు ఒప్పుకున్నాడని ఎన్సీబీ పంచనామాలో పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకోవడానికే ఈ విహారయాత్రను ఎంచుకున్నట్లు వారు చెప్పారని ఎన్సీబీ తెలిపింది.
క్రూయిజ్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఆర్యన్ తరపు న్యాయవాది సతీష్ మన్షిండే బెయిల్ దరఖాస్తును ఫోర్ట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దాంతో సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయనున్నారు. ఎన్సీబీ విచారణలో ఆర్యన్, అర్బాజ్ మర్చంట్ డ్రగ్స్ తీసుకున్నామని ఒప్పుకున్నట్లు తెలిసింది. క్రూయిజ్లో సెర్చ్ సమయంలో షూలో దాచిపెట్టిన జిప్ లాక్ పర్సు నుంచి డ్రగ్స్ను గుర్తించినట్లు, అర్బాజ్ నుంచి 6 గ్రాముల చరస్ను కనుగొన్నామని కోర్టు ముందు ఉంచిన పంచనామాలో ఎన్సీబీ పేర్కొన్నట్లు సమాచారం. పంచనామా ప్రకారం, ఆర్యన్, అర్బాజ్లను ప్రశ్నించడానికి గల కారణాలను ఎన్సీబీ అధికారి ఆశిష్ రంజన్ ప్రసాద్ చెప్పారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 గురించి వారిద్దరికీ వివరించారు.
ఇలాఉండగా, ఫోర్ట్ కోర్టు ఆదేశం కాపీని చూసిన తర్వాత ఏం చేయాలో సోమవారం నిర్ణయించనున్నట్లు ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మన్షిండే చెప్పారు. ఆర్యన్కు నేర నేపథ్యం లేదని శుక్రవారం కోర్టులో మన్షిండే వాదించారు. తెలిసిన వారి ఆహ్వానం మేరకు క్రూయిజ్లో పార్టీకి వెళ్లినట్లు కోర్టుకు తెలిపారు.
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..