తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు సాగర్ (72) గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పూర్తి పేరు విద్యాసాగర్ రెడ్డి. సుదీర్ఘ కెరీర్లో ఆయన 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సాగర్ గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించారు. ‘మహ్మద్ బిగ్ తుగ్లక్’ చిత్రంతో సహాయ దర్శకుడిగా కెరీర్ను ఆరంభించారు. నరేష్- విజయశాంతి కలిసి నటించిన ‘రాకాసి లోయ’ (1983) చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. డాకు, స్టూవర్టుపురం దొంగలు చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడ్డారు.
సూపర్స్టార్ కృష్ణతో తీసిన ‘అమ్మదొంగ’ చిత్రం సాగర్కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1, జగదేక వీరుడు, ఖైదీ బ్రదర్స్, చార్మినార్ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆయన రూపొందించిన ‘రామసక్కనోడు’ చిత్రానికి మూడు నంది అవార్డులు లభించాయి. శ్రీనుైవెట్ల, వి.వి.వినాయక్, రవికుమార్ చౌదరి వంటి అగ్ర దర్శకులు సాగర్ దగ్గర శిష్యరికం చేశారు. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు సాగర్.