samarasimha reddy | టాలీవుడ్లో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 1999లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్లో ఒక మైలు రాయిలా నిలిచిపోయింది. ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా మారింది. అంతలా సంచలనం సృష్టించింది సమరసింహారెడ్డి సినిమా. ఈ సినిమా విడుదలై నేటికి 23 ఏండ్లు పూర్తవుతుంది.
లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సినిమాల తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉండేవి. అందుకే విజయేంద్ర ప్రసాద్తో అదిరిపోయే కథను సిద్ధం చేయించారు. దీనికి ముందుగా సమరసింహం అని అనుకున్నారు. కానీ పరచూరి గోపాలకృష్ణ సూచన మేరకు సమరసింహారెడ్డిగా మార్చారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. సిమ్రన్, సంఘవి, అంజలి జవేరిలు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో ముందుగా సిమ్రన్ ప్లేస్లో హీరోయిన్ రాశిని అనుకున్నారు. ఆమెకు కథ కూడా చెప్పారు. అయితే సీతాకోక చిలుక సీన్ రాశికి నచ్చలేదు. దీంతో ఆ సీన్లో నటించేందుకు ఒప్పుకోలేదు. అందుకే రాశి ప్లేసులో సిమ్రన్ను తీసుకున్నారు.
సుమారు 6 కోట్ల బడ్జెట్తో సమరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 16 కోట్లు వసూలు చేసింది. 73 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. 29 సెంటర్లలో 175 రోజులు, మూడు థియేటర్లలో 227 రోజులు ఆడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?
Ramesh babu | మొదటి సినిమాకే బాలయ్యతో వివాదం..
Akhanda | అఖండ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ .. డిస్నీ హాట్స్టార్లో గర్జించేది అప్పుడే