Samrat Title conflict between ramesh babu and Balakrishna | చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు తెలుగులో దాదాపు 20 సినిమాల్లో నటించాడు. కానీ చాలా సినిమాలు ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందిన ఆయన.. నటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత తమ్ముడు మహేశ్ బాబు ప్రోత్సాహంతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. ఇదిలా ఉంటే రమేశ్ బాబు సినిమా ఎంట్రీ కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా హీరోగా ఆయన చేసిన ఫస్ట్ రెండు సినిమాలు కూడా నందమూరి బాలకృష్ణతో వివాదాన్ని తీసుకొచ్చాయి. మరి ఆ సంఘటనలు ఏంటో ఒకసారి చూద్దాం..
అప్పటికే టాలీవుడ్లో వారసులు రావడం మొదలైంది. ఏయన్నార్ వారసుడిగా నాగార్జున, రామానాయుడి వారసుడిగా వెంకటేశ్ సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ కూడా పలు సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే కృష్ణ తన పెద్ద కుమారుడు రమేశ్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడు. అలా సామ్రాట్ సినిమాను మొదలుపెట్టాడు. కొడుకు అరంగేట్రం మూవీ కావడంతో కృష్ణ ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. వివిధ ఇండస్ట్రీల నుంచి ఎంతో అనుభవం ఉన్న నిపుణులను సినిమా కోసం తీసుకొచ్చాడు. కానీ అప్పటికే బాలకృష్ణ హీరోగా సేమ్ టైటిల్తో ఒక సినిమా మొదలైంది. రమేశ్ బాబు, బాలకృష్ణ సినిమాలు రెండింటికీ ఒకే టైటిల్ కావడంతో పెద్ద యుద్ధమే జరిగింది. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య వివాదాలు వచ్చాయి. దీంతో కావాలనే ఒకే టైటిల్తో సినిమాను తీస్తున్నారనే వాదన వినిపించింది. ఈ క్రమంలో టైటిల్ కోసం ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. ఇరు వర్గాలు కోర్టు దాకా వెళ్లాయి. చివరకు సామ్రాట్ టైటిల్ రమేశ్ బాబుకు దక్కింది. ఇక బాలకృష్ణ సినిమా సాహస సామ్రాట్ పేరుతో విడుదలైంది. అయితే రమేశ్ బాబు నటించిన సామ్రాట్ సూపర్ హిట్ కాగా.. బాలయ్య నటించిన సాహస సామ్రాట్ పరాజయం పాలైంది.
ఇక రెండోసారి బాలయ్య చేయాల్సిన సినిమాను రమేశ్ బాబు చేశాడు. జంధ్యాల దర్శకత్వంలో రెండు రెళ్లు ఆరు చిత్రాన్ని నిర్మించిన జి. సుబ్బారావు తన తదుపరి సినిమాను కూడా ఆయనతోనే తీయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఒక కథ కూడా అనుకున్నారు. కథ ప్రకారం సినిమా సగభాగం అమెరికాలో జరుగుతుంది. అప్పటికే జంధ్యాల విజయశాంతితో పడమటి సంధ్యారాగం సినిమాను అమెరికాలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో రెండు సినిమాల షూటింగ్ను ఒకేసారి పూర్తి చేయాలని భావించాడు జంధ్యాల. ఇదే విషయాన్ని జి.సుబ్బారావుకు చెబితే సరే అన్నాడు. అదే సమయంలో విరామం కోసం బాలయ్య అమెరికా వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో అమెరికా టూర్లో ఉన్నప్పుడే తమ సినిమాలో నటించాలని బాలకృష్ణను జంధ్యాల అడిగారు. దీనికి బాలయ్య కూడా ఒకే చెప్పాడు. దీంతో ఆ సినిమా కోసం 20 రోజుల షెడ్యూల్ను జంధ్యాల ప్లాన్ చేసుకున్నాడు. నటీనటులను ఎంపిక చేసి వీసాలకు కూడా అప్లై చేశాడు. కానీ వీసాలు రావడంలో ఆలస్యం కావడంతో బాలయ్య డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో బాలయ్యను కాకుండా జంధ్యాల మరో హీరోను వెతుక్కోవాల్సి వచ్చింది. అప్పుడే జంధ్యాల కన్ను కృష్ణ పెద్ద కుమారుడిపై పడింది. అప్పటికే సామ్రాట్ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఇంకా విడుదల కాలేదు. కానీ కుర్రాడు బాగున్నాడని అనుకున్న జంధ్యాల.. రమేశ్ బాబును ఫిక్సయ్యాడు. కృష్ణతో మాట్లాడి ఒప్పించాడు. ఆ తర్వాత కథలో పలు మార్పులు చేర్పులు చేశారు. చిన్నికృష్ణుడు పేరుతో సినిమాను తెరకెక్కించారు. కుష్బూ ఇందులో కథానాయిక. 1988లో విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు. అలా బాలకృష్ణ చేయాల్సిన సినిమాను రమేశ్ బాబు చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mahesh | మరో జన్మంటూ ఉంటే.. అప్పుడూ నువ్వే నా అన్నయ్య: సోదరుడి మృతిపై మహేశ్ ట్వీట్
మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!
రమేశ్బాబు మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !